Article Search

 గోదాదేవి జయంతి
నేడు జూలై 22 శనివారం ... గోదాదేవి జయంతి, ఆండాళ్ జయంతి సందర్భంగా...గోదాదేవి జయంతిని తమిళనాట ఆది పూరం అనే పేరుతో పెద్ద పండుగలా జరుపుకుంటారు. పూరం అనేది పూర్వా ఫల్గుణి నక్షత్రాన్ని సూచిస్తుంది. ఆది అనే పేరు గల తమిళ మాసములో పూర్వా ఫల్గుణి నక్షత్రం వచ్చిన రోజున గోదాదేవి జయంతిని జరుపుకుంటారు కాబట్టి ఈ పండుగను ఆది పూరం అనే పేరుతో వ్యవరిస్తారు. గోదాదేవిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ఆది పూరం పండుగని వైష్ణవ మరియు శక్తి ఆలయాలలో ఉత్సవంగా జరుపుతారు.గోదాదేవి తన అద్వితీయమైన భక్తితో శ్రీరంగనాథున్ని భర్తగా పొందిన కథ ప్రాచుర్యంలో ఉంది. ఆమె పన్నెండు మంది ఆళ్వారుల్లో ఉన్న ఏకైక స్త్రీగా ప్రసిద్ధి పొందిన..
MA ANDAL LORD RENGAMANNAR THIRUKALYANAM
INTRODUCTIONThere is a famous Andal temple in Srivilliputhur, and in this famous Temple, Andal-Rengamannar Tirukkalyanam festival event would be grandly celebrated during the Tamil month Panguni. The Utsava deity of Andal and Rengamannar, would be carried in a chariot during the time of festival days in the streets of Srivilliputhur, and people living in the nearby streets used to participate personally.While witnessing the holy marriage ceremony, devotees used to chant the names of Lord Vishnu, such as, "Govinda, Gopala, Achuta, Ananta, Bhumata, Bhudevi, Andal Thayaar". De..
రేపటి నుండి ధనుస్సంక్రమణం ప్రారంభం
కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన , సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు….అదే విధముగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు.సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం ..

తిరుప్పావై పాశురము - 30 

 

ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపజేసి, లక్ష్మీదేవిని పొంది, మాధవుడైన వానిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును, విలక్షణ ఆభరణములు దాల్చివారును, అగు గోపికలు చేరి, మంగళము పాడి 'పఱ' అను వాద్యమును లోకులకొరకును, భగవద్దాస్యమును తమకొరకు పొందిరి. 

తిరుప్పావై పాశురము -29 

 

బాగా తెల్లవారక మునుపే నీవు ఉన్న చోటికి మేము వచ్చి, నిన్ను సేవించి, బంగారు తామరపూవులు వలె సుందరములు రమణీయములైన పాదములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము. పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాను భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను, స్వేకరింపకుండుట తగదు. నేను నీనుండి 'పఱ'ను పుచ్చుకొనిపోవుటకు వచ్చినవారము కాము. ఏనాటికినీ … ఏడేడు జన్మలకునూ నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను.

తిరుప్పావై పాశురము - 28

 

పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించి ఉండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియూ జ్ఞానము లేని మా గోపవంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకేన్ని లోపములున్నాను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు.

తిరుప్పావై పాశురము - 27 

 

తనతో కూడని శతృవులను జయించెడి కళ్యాణగుణసంపదగల గోవిందా! నిన్ను కీర్తించి వ్రత సాధనమగు 'పఱ' అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పైభాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందెయలు - గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను.

తిరుప్పావై పాశురము - 26 

 

ఆశ్రిత వ్యామోహము కలవాడాఇంద్రనీలమణిని పోలిన కాంతియుస్వభావము కలవాడాఅఘటితఘటినా సామర్థ్యముచే చిన్న మఱ్ఱిఆకుపై అమరి పరుండువాడామేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించినీ వద్దకు వచ్చితిమిఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారునీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదనుఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు,

తిరుప్పావై పాశురము - 25

భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి, శంఖచక్రగదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవికి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణంగా అనుభవించి, కట్టను - కొట్టాను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో

తిరుప్పావై పాశురము - 24

 

పూర్వం లోకాలన్నిటినీ నీ అడుగులతో కొలిచిన స్వామీ! నీ పాదాలకు మంగళం! లంకలోని రక్కసుల్ని అందర్నీ మట్టుపెట్టినవాడా! నీ బాహుబలానికి శుభమంగళం! శకటాసురుణ్ణి చిన్నపాదాలతో తన్నిన స్వామీ! నీ కీర్తికి మంగళం! వత్సాసురుణ్ణి ఒడిసెలరాయివలె విసిరివేసి, కపిత్థాసురుని కూల్చివేసిన బలశాలీ! నీ అడుగులకు మంగళం ! శుభమంగళం!! గోవర్థనగిరిని గొడుగుగా ఎత్తి కాపాడిన స్వామీ నీ కృపకు దివ్య మంగళం !

తిరుప్పావై పాశురము - 23

 

వానాకాలంలో గుహలో నిద్రిస్తున్న సింహం ఒక్కసారిగా నిద్రలేచి, వళ్ళు సాగదీసి విరుచుకొని, గగుర్పాటుగా వళ్ళు దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే అవిసెపుష్పంవలె నల్లని మేనితో నిగనిగ మెరుస్తున్న ఓ కన్నయ్య! శయన మందిరంనుండి బయలు వెడలి కొలువుమంటపానికి విజయంచేసి సింహాసనంపై

తిరుప్పావై పాశురము - 22 

 

భూమండలంలోని చక్రవర్తులంతా తమ శరీరాభిమానాలను, అహంకారాలను పూర్తిగా వదలివేసి, నీ మంచము దగరికి వచ్చి, దేవరవారి దయకై కాచుకొని వున్నవారివలె, మేమూ గుంపుగా వచ్చి నీ దివ్యసన్నిధిలో నిలిచివున్నాము. కృష్ణా! మువ్వల నోరులాగ, అరవిరిసిన ఎఱ్ఱని తామర మొగ్గవలెనున్న నీ కన్నుల్ని మెల్లమెల్లగా తెరచి నీ చల్లనిచూపు మాపై ప్రసరింపజేయుమా! ఓ కన్నయ్య! సూర్యచంద్రులు ఉదయించినట్లుగా

తిరుప్పావై పాశురము - 21

 

కుండలు అన్నీ నిండి పోర్లిపోయేవిధంగా పాలను ఇచ్చే ఆవులమందను దండిగా సంపాదించి ప్రసిద్ధిగన్న నందగోపుని కుమారుడైన ఓ గోపాలకృష్ణా! నిదుర మేల్కొవయ్యా! అశ్రితరక్షకా! ప్రపన్నార్తిహరా! శత్రువులు నీవల్ల పరాజితులై దిక్కుగానక నీ ముంగిట వచ్చి నీ పాదాలమీద పడి మీకు సేవచేస్తున్న రీతిని, మేము పొగడుతూ నీకు మంగళాశాసనం పాడటానికిగాను,

తిరుప్పావై పాశురము - 20

 

ముప్పైమూడుకోట్ల దేవతలకు భయాలు కలగడానికి ముందే వారి దగ్గరకు వెళ్ళి వారి ఆపదలను తొలగించే ఓ గోపాలకృష్ణా! ఇక నిద్దుర మేలుకొనవయ్యా! (కృష్ణయ్య పలుకనందువల్ల) స్వర్గ కలశాలవంటి వక్షోజాలు, పగడాలవంటి ఎఱ్ఱని పెదవులు, సొంపైన సన్నని నడుమూ గలిగి శ్రీమహాలక్ష్మి వంటి సౌందర్యంగల ఓ నీలాదేవీ!

Showing 1 to 14 of 33 (3 Pages)